- ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్, వెలుగు: ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం షాద్నగర్ బస్టాండ్ ఆవరణలో కొత్తగా మంజూరైన 8 సిటీ మెట్రో బస్సు సర్వీసులను ఆయన ప్రారంభించారు.కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
