గచ్చిబౌలి/శంకర్ పల్లి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఎస్సైల బదిలీలు జరిగాయి. 87 మంది ఎస్సైలను ట్రాన్స్ ఫర్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన వారిలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, విమెన్ పీఎస్, సైబర్ క్రైమ్, ఎస్వోటీ విభాగాలకు చెందిన వారు ఉన్నారు. బదిలీ అయిన ఎస్సైలు ఆయా పోలీస్ స్టేషన్లలో వెంటనే రిపోర్టు చేయాలని సీపీ సూచించారు.