పెదనాన్న ఇంట్లోనే 8వ తరగతి అమ్మాయి దొంగతనం.. లవర్ కు బంగారం చేరవేత

పెదనాన్న ఇంట్లోనే 8వ తరగతి అమ్మాయి దొంగతనం.. లవర్ కు బంగారం చేరవేత

ఈ సోషల్ మీడియా ఉంది చూడండీ.. పిల్లలను నాశనం చేస్తుంది అనటానికి ఇదో ఎగ్జాంపుల్. హైదరాబాద్ సిటీ చిలకలగూడలో జరిగిన ఓ ఘటన పేరంట్స్ అందరికీ అప్రమత్తం చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సిటీ చిలకలగూడలో నివాసం ఉంటుంది ఓ ఫ్యామిలీ. ఈ క్రమంలోనే ఇంటి యజమానురాలి చెల్లెలు కుమార్తెకు మంచి చదువు కోసం.. ఊరు నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. 8వ తరగతి చదువుతున్న ఆ అమ్మాయికి.. స్నాప్ చాట్ లో అర్జున్ రెడ్డి అనే యువకుడు పరిచయం అయ్యాడు. ప్రేమ దోమ అంటూ మాటలు కలిపాడు.. 8వ తరగతి అమ్మాయి కూడా ఈ అర్జున్ రెడ్డి వలలో పడింది. అతను ఎలా చెబితే అలా చేస్తుంది.. దీన్ని అవకాశంగా తీసుకున్నాడు అర్జున్ రెడ్డి.. 

8వ తరగతి చదువుతున్న అమ్మాయితో మాటలు కలిపి.. డబ్బులు కావాలని కోరాడు. దీంతో పెదనాన్న ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారాన్ని విడతలవారీగా అర్జున్ రెడ్డికి చేరవేస్తుంది. ఓ రోజు అమ్మాయి పెదనాన్న ఇంట్లో 3 వేల రూపాయలు పెట్టి బయటకు వెళ్లాడు. వచ్చిచూస్తే డబ్బులు లేవు. ఇంట్లో ఉన్నది ఈ అమ్మాయి మాత్రమే. దీంతో అనుమానం వచ్చి.. ఇంట్లోని బీరువా మొత్తం పరిశీలించగా 16 తులాల బంగారం, మరికొంత డబ్బు కనిపించలేదు. అమ్మాయి ఫోన్ పరిశీలించగా ఓ వ్యక్తితో రెగ్యులర్ గా మాట్లాడటం, అతనికి డబ్బులు పంపించినట్లు మెసేజ్ లు ఉండటం కనిపించింది. 

ఈ విషయంపై పోలీసులకు కంప్లయింట్ చేయగా.. అమ్మాయిని విచారించిన పోలీసులు.. అర్జున్ రెడ్డి గుట్టు రట్టు చేశారు. అతన్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు.. అతడి నుంచి బంగారం, డబ్బులు రికవరీ చేశారు. అమ్మాయి మైనర్ కావటం కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. నిందితుడు అర్జున్ రెడ్డిపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. 

స్నాప్ చాట్ ద్వారా పిల్లలను వల వేసి.. డబ్బులు, బంగారం దోచుకున్నాడని.. ప్రేమ పేరుతో మాయ చేశాడని చెబుతున్నారు పోలీసులు. తల్లిదండ్రులు ఇంట్లోని పిల్లలను ఓ కన్నేసి ఉంచాలని.. వారికి ఫోన్లు ఇస్తు్న్నట్లయితే వాటిని తరచుగా పరిశీలించాలని సూచిస్తున్నారు పోలీసులు.