ఒకే రోజులో 91 మంది పోలీసులకు కరోనా

ఒకే రోజులో 91 మంది పోలీసులకు కరోనా

ముంబై: మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్​లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన ఒకే రోజులో 91 మంది పోలీస్ సిబ్బందికి వైరస్ సోకిందని అక్కడి అధికారులు ఆదివారం వెల్లడించారు. దీంతో డిపార్ట్ మెంట్​లో మొత్తం కేసుల సంఖ్య 2,416 కు పెరిగింది. వైరస్ బారిన పడి మరణించిన పోలీసుల సంఖ్య 26 గా ఉంది. మరో 1,421 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇందులో 183 మంది ఆఫీసర్లు ఉండగా, 1238 మంది వివిధ హోదాల్లో ఉన్నారు. గత రెండ్రోజులుగా రోజుకు వందకు పైగా కేసులు బయటపడుతుందడగా.. ఈ రోజు మాత్రం వందకు లోపు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో ఇప్పటివరకు 62,228 కేసులు నమోదు కాగా.. 2,098 మంది మృత్యువాత పడ్డారు.