కరోనా విజృంభణ..ఒక్కరోజే 93 వేలకు పైగా కేసులు

కరోనా విజృంభణ..ఒక్కరోజే 93 వేలకు పైగా కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతోంది. గత కొన్ని రోజులుగా రోజు వారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 93,249 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య మొత్త కోటి 24 లక్షల 85 వేల 509 కి చేరాయి. నిన్న ఒక్కరోజే 513 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య  1,64,623 కి చేరింది. నిన్న 60,048 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో  కోటి 16లక్షల 29 వేల289 మంది కోలుకున్నారు..ఇంకా  6,91,597 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.  దేశ వ్యాప్తంగా నిన్నటి వరకు 7 కోట్ల 59లక్షల 79వేల 2651 మందికి వ్యాక్సిన్ వేశారు.