థార్​ ఎడారిలో డైనోసర్​ శిలాజం

థార్​ ఎడారిలో డైనోసర్​ శిలాజం

ఐఐటీ–రూర్కీ, భారత భూగర్భ సర్వే సంస్థ పరిశోధకులు రాజస్థాన్​ జైసల్మేర్​లోని థార్​ ఎడారిలో 16.7 కోట్ల ఏళ్ల క్రితం నాటి డైనోసార్​ శిలాజాన్ని కనుగొన్నారు. డైక్రెయోసౌరిడ్​ శాఖకు చెందిన ఈ జీవి పొడవైన మెడ కలిగిన శాకాహారి. 30 అడుగుల నుంచి 40 అడుగుల పొడవు, పొట్టి మెడ, తోక దీని ప్రత్యేక లక్షణాలు. ఇంతకుముందు చైనాలో కనుగొన్న డైక్రయోసౌరిడ్​ 16.6 కోట్ల నుంచి 16.4 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది.

దాని కంటే పురాతనమైన శిలాజం థార్​ ఎడారిలో లభించడం విశేషం. దీనికి మన పరిశోధకులు థారోసారన్​ ఇండికస్​ అని నామకరణం చేశారు. భారత్​లో ఇలా డైక్రెయోసౌరీడ్​ సరీసృప శిలాజం లభించడం ఇదే తొలిసారి. ఇంతకుముందు మధ్య భారతంలో 19.9 కోట్ల నుంచి 18.3 కోట్ల  ఏళ్ల క్రితం నాటి రెండు రకాల సరీసృప శిలాజాలు కనిపించాయి. అవి థారోసారస్​ కంటే పురాతనమైన సరీసృపాలైన బారపాసౌరస్​, కోటా సౌరసులు.