
కొప్పల్: కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో అత్యంత దారుణం జరిగింది. మే 31న రాత్రి 10 గంటల సమయంలో కొప్పల్ జిల్లాలోని ఓ బేకరీలోకి ఏడుగురు దౌర్జన్యంగా వెళ్లారు. ఆ బేకరీలోకి పరిగెత్తుకుంటూ వచ్చిన ఒకరిని టార్గెట్ చేశారు. కత్తులు, కొడవళ్లతో విచక్షణారహితంగా అతనిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.
#BREAKING
— Nabila Jamal (@nabilajamal_) June 2, 2025
Man hacked to death inside bakery in #Karnataka's Koppal
Chenappa Narinal was chased and brutally attacked with machetes inside a bakery. CCTV shows him running in circles trying to escape, but was eventually stabbed to death outside the shop
All 7 accused Ravi,… pic.twitter.com/3J0mI3JQDB
ఈ దారుణ హత్యకు సంబంధించిన ఉదంతం మొత్తం ఆ బేకరీలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు ఈ హత్య చేసిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. రవి, ప్రదీప్, నాగరాజ్, గౌతమ్, ప్రమోద్, మంజునాథ్ అనే పేరున్న మరో ఇద్దరు ఈ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ హత్యకు గురైన వ్యక్తిని చెన్నప్ప నరినల్(35)గా పోలీసులు గుర్తించారు.
పాత పగలు, భూ తగాదాలే ఈ దారుణ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు తెగబడ్డ ఏడుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మే 31న కొప్పల్ జిల్లా కుస్తగి తాలూకా తవరగెర పట్టణంలో ఈ హత్య ఘటన జరిగింది. నిందితులు కత్తులతో తెగబడుతుంటే బాధితుడు ఆ బేకరీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఏడుగురు అతనిని ఆ బేకరీ నుంచి బయటకు పోనివ్వకుండా కత్తులతో పొడిచి చంపేశారు. తవరగెర సీపీఐ, గంగావతి డీఎస్పీ క్రైం సీన్కు వెళ్లి పరిశీలించారు.
ఈ హత్యలో మరికొందరి పాత్ర కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు భయంతో నివ్వెరపోతున్నారు. రాంగోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ లాంటి సినిమాల్లో చూపించినట్టే వెంటాడి, వేటాడి చంపేయడాన్ని చూసి నెటిజన్లు షాకయ్యారు. కర్ణాటకలో శాంతిభద్రతలపై కన్నడిగులు ఆందోళన వ్యక్తం చేశారు.