ఆర్డర్ రాలేదని అడిగినందుకు జెప్టో డెలివరీ బాయ్స్ దాడి

ఆర్డర్ రాలేదని అడిగినందుకు జెప్టో డెలివరీ బాయ్స్ దాడి
  •     చిక్కడపల్లిలో కస్టమర్​ ఫిర్యాదు

ముషీరాబాద్, వెలుగు : చిక్కడపల్లి పరిధిలోని అంబేద్కర్ బస్తీలో సోమవారం అర్ధరాత్రి జెప్టో డెలివరీ బాయ్స్ ఓ కస్టమర్ పై మూకుమ్మడి దాడి చేశారు. అంబేద్కర్ బస్తీకి చెందిన సందీప్ రాత్రి జెప్టోలో పెన్సిల్ ప్యాకెట్​తో పాటు కేక్, పెరుగు ఆర్డర్​పెట్టాడు. ఎంతకీ రాకపోవడంతో డెలివరీ బాయ్ కి కాల్​చేసి అడిగాడు. అతడు సందీప్​ను వీఎస్టీ ఎస్పీ గార్డెన్ వద్ద ఉన్న జెప్టో హబ్ కు వచ్చి మాట్లాడాలని కోరాడు. సందీప్ అక్కడకు వెళ్లి ఆర్డర్ కోసం గట్టిగా ప్రశ్నించాడు. దీంతో అక్కడే ఉన్న డెలివరీ బాయ్స్​అంతా కలిసి సందీప్​ను చితకబాదారు. వెంకట్ రాజు అనే వ్యక్తితో పాటు మరికొందరు కలిసి గంజాయి మత్తులో తనపై దాడి చేశారని సందీప్ చిక్కడపల్లి పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.