
చదివేది టెన్త్ క్లాస్.. స్మార్ట్ ఫోన్ ప్రభావంతో ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ యువకుడిని ప్రేమించింది. అంతేకాదు.. హద్దు మీరి ప్రవర్తించేందుకు ఇంటినుంచి వెళ్లిపోయిన ఆ జంటను .. ప్రియురాలు తేజశ్రీ తల్లి అంజలి మందలించి తీసుకొచ్చింది. ఇక అంతే తల్లిపై ప్రేమ పగ పెంచుకున్న మైనర్ కూతురు తల్లిని హత్య చేసింది. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాల్లోకి వెళితే...
మానవ సంబంధాలను మంటగలిపే ఓ విషయం వెలుగులోకి వచ్చింది. బుద్దిగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయి చేరాలని ప్రతి తల్లిదండ్రులు ఆశ పడతారు. అయితే ఓ అమ్మాయి పదో తరగతిలోనే ఆ స్థాయికి ఎదిగింది. మెచ్చుకొనే పని చేయలేదు..కాని అందరూ ఛీకొట్టే స్థాయికి చేరుకుంది.
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. జీడిమెట్లలో పదవ తరగతి బాలిక తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసింది. తమ ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించి, మందలించినందుకు తల్లిని కిరాతకంగా చంపేసింది. ప్రియుడితో పాటు అతడి సోదరుడితో కలిసి కన్నతల్లి ఊసురు తీసింది.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి న్యూ ఎల్ బి నగర్ లో ఉంటున్న అంజలి (39) పదో తరగతి చదువుతున్న తన కూతురిని ప్రేమ విషయంలో మందలించింది. ఇది మనసులో పెట్టుకున్న అంజలి కూతురు, ఆమె ప్రియుడు (18), అతని తమ్ముడు (18)తో కలిసి సోమవారం ( జూన్ 23) అర్ధరాత్రి అంజలి గొంతు నులిమి, తలపై కొట్టి హత్య చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీడిమెట్లకు చెందిన బాలిక తేజశ్రీ స్థానికంగా పదో తరగతి చదువుతోంది. ఆమెకు శివ (19) అనే కుర్రాడితో ఇన్స్ట్రాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసుకుంది. ఇద్దరూ గాఢ ప్రేమలో మునిగిపోయారు. ఫోన్లు, మెసేజ్లతో పాటు చెట్టాపట్టాలేసుకొని తిరగటం ప్రారంభించారు.
ఈ విషయం తల్లికి తెలిసింది. ఈ వయసులో ఇది సరైన పద్ధతి కాదని... బాగా చదువుకోవాలని కూతురిని మందలించింది. దీంతో తల్లిపై బాలిక పగ పెంచుకుంది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది.ఇద్దరూ కలిసి తల్లి హత్యకు స్కెచ్ వేశారు. అందుకు శివ తన సోదరుడు యశ్వంత్ సహాయం తీసుకున్నాడు. ముగ్గురూ కలిసి ఒంటరిగా ఉన్న తల్లిని కిరాతకంగా చంపేసారు.
ఎలా చేశారంటే...
తల్లి అంజలి పూజ చేసుకుంటుంది. వెనుక నుంచి వచ్చిన ఆమె కుమార్తె తేజశ్రీ తలపై సుత్తితో గట్టిగా కొట్టింది. అక్కడే నక్కి ఉన్న ప్రియుడు శివ సోదరుడు యశ్వంత్ కత్తితో గొంతుకోసి హత్య చేశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.