టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంటే అభిమానించని వారెవరుంటారు. అతని బ్యాటింగ్ స్టైల్. అలవోకగా కొట్టే సిక్సర్లకు ఫిదా అవ్వని వారుండరు. అందుకే అతన్ని ముద్దుగా హిట్ మాన్ అని పిలుచుకుంటారు. అయితే గత కొద్ది కాలంగా గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ శర్మ..లంకతో జరిగే వన్డే సిరీస్ ద్వారా మళ్లీ మైదానంలోకి దిగబోతున్నాడు. ఇందులో భాగంగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
గౌహతిలో రోహత్ శర్మ ప్రాక్టీస్ చేస్తుండగా అతన్ని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఈ సమయంలో కొందరు అభిమానులను రోహిత్ శర్మ కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అయితే మైదానంలో రోహిత్ శర్మను చూసే సరికి ఓ ఫ్యాన్ కన్నీరు పెట్టుకున్నాడు. రోహిత్ శర్మను చూడగానే ఓ బాలుడు బావోద్వేగానికి గురయ్యాడు. అతన్ని చూసిన రోహిత్ శర్మ..బాలుడి దగ్గరకు వెళ్లి ఓదార్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
డిసెంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్ నుంచి రోహిత్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్ లో బొటనవేలికి గాయం కావడంతో.. బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్కు దూరమయ్యాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లోనూ హిట్ మాన్ ఆడలేదు. చాలా రోజుల తర్వాత లంకతో జరిగే వన్డే సిరీస్కు మళ్లీ రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు.