పాల వ్యాపారం కోసం హెలికాప్టర్ కొన్న రైతు

పాల వ్యాపారం కోసం హెలికాప్టర్ కొన్న రైతు
  • రూ.30 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన భీవండి రైతు

భీవండి: పాల బిజినెస్ కోసం ఏకంగా హెలికాప్టర్ కొన్నాడో రైతు. రూ.30 కోట్లు పెట్టి మరీ దాన్ని కొనుగోలు చేశాడు. మహారాష్ట్రలోని భీవండికి చెందిన జనార్దన్ బోయర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. అయితే ఇటీవల డెయిరీ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ‘‘పాల వ్యాపారం కోసం నేను దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు వెళ్తుంటాను. పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్.. ఇలా తిరుగుతుంటాను. అయితే చాలా ప్రాంతాలకు ఎయిర్ పోర్టు ఫెసిలిటీ లేదు. కారు, బస్సు, రైలులో వెళ్లాలంటే గంటలకొద్దీ టైమ్ పడుతోంది. అందుకే ఫ్రెండ్ సలహా మేరకు హెలికాప్టర్ కొన్నాను” అని చెప్పాడు జనార్దన్. ఆయన ఆర్డర్ ఇచ్చిన కంపెనీ ట్రయల్ కోసం హెలికాప్టర్ ను ఇప్పటికే జనార్దన్ ఊరికి పంపించింది. మార్చి 15న హెలికాప్టర్ డెలివరీ ఇస్తారని.. 2.5 ఎకరాల్లో హెలిప్యాడ్, హెలికాప్టర్ గ్యారేజ్, పైలట్, టెక్నీషియన్ రూమ్స్ నిర్మిస్తున్నానని ఆయన చెప్పారు. జనార్దన్ కు రూ.100 కోట్ల ఆస్తులున్నట్లు తెలుస్తోంది. ఆయనకు భీవండిలో గోదాములు ఉన్నాయి. వాటికి వచ్చే కిరాయి ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది.

For More News..

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో మహిళపై రేప్​

ఫుడ్ ​ప్యాకెట్లపై ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ముద్రిస్తరు?

మీరు సీఎం అయ్యాకే తెలంగాణ తలరాత మారింది