కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ లో అగ్నిప్రమాదం

కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : వనస్థలిపురంలోని కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో రెండవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలియగానే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సుబ్బయ్య హోటల్ లోని మూడవ అంతస్తులో చిక్కుకున్న 40 మంది సిబ్బందిని ఫైర్ సిబ్బంది, పోలీసులు కాపాడారు. తీవ్రంగా శ్రమించి.. మంటలను పూర్తిగా ఆర్పివేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.