ఈ మధ్య తరచూ ఎక్కడో ఒకచోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ఇటావాలో న్యూఢిల్లీ-దర్భంగా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. బోగీల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలియగానే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. ప్రస్తుతం మంటలను ఆర్పివేస్తున్నారు. సరాయ్ భూపత్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.