షాద్ నగర్ లో 480 గంజాయి చాక్లెట్స్ స్వాధీనం

షాద్ నగర్ లో 480 గంజాయి చాక్లెట్స్ స్వాధీనం

గంజాయ్ చాక్లెట్స్ అమ్ముతున్న ముఠాను రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్ నగర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. షాద్ నగర్ పట్టణంలోని నాగులపల్లి రైతు కాలనీ మినీ చౌరస్తా వద్ద ఓ కిరాణా షాపులో గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. 480 గంజాయి చాక్లెట్స్ ప్యాకెట్లను స్వాధీన పరుచుకొని వారిని విచారించారు. 

ఈ విచారణలో భాగంగా నందిగామ వద్ద ఉన్న అయ్యప్ప దేవాలయం కిరాణం షాపులో 40 గంజాయి చాక్లెట్స్ ఉన్నాయన్న సమాచారం తెలుసుకొని వాటిని కూడా స్వాధీనపరుచుకున్నారు. కాటేదాన్ నుండి ఈ గంజాయి చాక్లెట్స్ రవాణా అవుతున్నట్లు ఎక్సైజ్ సీఐ రామకృష్ణ తెలిపారు. కాటేదాన్ కు చెందిన వ్యక్తితో పాటు సుశీల్, శశికాంత్, జలంధర్, అజయ్ కుమార్ నలుగురిని అదుపులో తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.