ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని గోకులపురిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనం కాగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ అడిషనల్ డీసీపీ దేవేశ్ కుమార్ మహ్లా తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 30 మురికి వాడలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటానన్నారు.

మరిన్ని వార్తల కోసం...

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్