జోగిపేటలో సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్ చల్..

 జోగిపేటలో సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్ చల్..

సంగారెడ్డి జిల్లాలో జోగిపేటలో కత్తితో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. శేఖర్ అనే బాలుడిని హత్య చేశానంటూ నాగరాజు అనే యువకుడు హల్ చల్ చేశాడు. దొంగతనం చేస్తుండగా చూసి చెప్పడంతో శేఖర్ పై నాగరాజు పగ పెంచుకున్నట్లు ఆరోపిస్తున్నారు మృతుడి బంధువులు. నిన్న రాత్రి బాలుడిని హత్య చేసి.. సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు.

కిందికి దించేందుకు ప్రయత్నించేవారిపై కత్తితో దాడి చేశాడు. అటు బాలుడి శేఖర్ మృతదేహం దొరకకపోవడంతో బంధువులు ఆందోళన చేస్తున్నారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శేఖర్ మృత దేహం కోసం గాలిస్తున్నారు జోగిపేట పోలీసులు.