
- కూకట్పల్లి పీఎస్లో కేసు నమోదు
కూకట్పల్లి, వెలుగు: కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ తమ్ముడు శ్రీనివాస్గౌడ్ వేధింపులతో తన భర్త సూసైడ్ చేసుకున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కూకట్పల్లిలోని వెంకటరావునగర్కు చెందిన అంకెనపల్లి కుమార్(28) ఎనిమిదేండ్లుగా బాచుపల్లిలోని శ్రీనివాస్గౌడ్కు చెందిన సమ్మక్క సారక్క క్రషర్ కంపెనీలో అకౌంటెంట్గా పని చేస్తున్నాడు.
ఇటీవల లెక్కల్లో రూ.కోటి తేడా వచ్చిందని పేర్కొంటూ శ్రీనివాస్గౌడ్తో పాటు సంస్థ సిబ్బంది కుమార్ను నిలదీశారు. తనకేమీ తెలియదని కుమార్ చెప్పినప్పటికీ రూ.కోటి సంస్థకు చెల్లించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పలుమార్లు కుమార్ను సంస్థ కార్యాలయంలో తీవ్రంగా కొట్టి గాయపరిచారు.
లెక్కల్లో తేడా వచ్చిన డబ్బు చెల్లించకపోతే మీ ఇంటికి వచ్చి కుటుంబు సభ్యులను కూడా ఇబ్బంది పెడుతామని బెదిరించారు. పలుమార్లు ఇంటి వద్ద ఉన్న కుమార్ను కార్యాలయానికి పిలిపించి మరీ కొడుతుండేవారు. ఈ విషయం తెలుసుకున్న కుమార్ అత్తయ్య డబ్బు విషయం గురించి సోమవారం మాట్లాడుకుందామని శ్రీనివాస్గౌడ్కు తెలిపింది. అయితే తీవ్ర భయాందోళనలకు గురైన కుమార్ఆదివారం రాత్రే ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని సూసైడ్చేసుకున్నాడు. ఈ మేరకు కుమార్ భార్య మౌనిక ఫిర్యాదు చేయడంతో కూకట్పల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.