
మియాపూర్, వెలుగు: వెల్డింగ్పనులు చేస్తుండగా విద్యుత్షాక్కొట్టడంతో బిల్డింగ్పైనుంచి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన దాడియాల సింహయ్య(46) భార్య కుమారి, ఇద్దరు పిల్లలతో కలిసి నగరంలోని యూసుఫ్గూడ జవహర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
అతను వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం మియాపూర్గోకుల్ ఫ్లాట్స్ కాలనీలో ఓ బిల్డింగ్మూడో అంతస్తులో వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. పక్కనే ఉన్న ఏసీ బోర్డు నుంచి విద్యుత్ షాక్కొట్టడంతో పైనుంచి కింద పడ్డాడు.
ఈ ప్రమాదంలో సింహయ్య తల, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్హాస్పిటల్కు తరలించగా.. మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.