భారత్ కు ఆయిల్ సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నాం: రష్యా 

భారత్ కు ఆయిల్ సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నాం: రష్యా 

పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధనం కొరత ఏర్పడితేభారత్​ దేశానికి ఆయిల్ సరఫరా చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. గల్ఫ్​ ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాకు ముప్పు కలిగించే అవకాశం ఉన్నందున నిరంతర సరఫరాకు సిద్దంగా ఉన్నట్లు రష్యా దౌత్య వర్గాలు వెల్లడించాయి. 

ఆరునుంచి 8వారాలపాటు చమురు డిమాండ్​ ను తీర్చేందుకు తగినంత ముడి సరుకు, ఇంధన నిల్వలు తమ దగ్గర ఉన్నాయని మిడిల్​ ఈస్ట్​ లో పెరుగుతున్న సైనిక సంఘర్షణ మద్య స్వల్పకాలికచమురు సరఫరా అడ్డంకులనుంచి దేశాన్ని కాపాడుతుందని భారత్​ చెప్పడంతో రష్యా ఈ హామీ ఇచ్చింది. 

భారత్​ కు ముడి చమురు, పెట్రోలియం గ్యాస్​ దిగుమతులన్నీ సగానిప హర్ముజ్​ జలసంధి నుంచి రవాణ అవుతాయి.ఇరాన్​ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఈ సంధిని ద్వారా చమురు రవాణా అంతరాయం ఏర్పడింది. హార్ముజ్​ జలసంధి గుండా షిప్పింగ్​ ను అడ్డుకుంటామని ఇరాన్​ హెచ్చరించింది. బీమా సంస్థల కవరేజ్​ ని ఉపసంహరించుకుంది. ఇది ఆయిల్​ షిప్​కదలికలను ప్రభావితం చేసింది. 

►ALSO READ | ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్‎ను నాశనం చేసినం.. అగ్ర నాయకత్వం కూడా ఖతం: ట్రంప్

ప్రస్తుతం మనదేశంలో  25 రోజులకు సరిపడా ముడి చమురు, ఇంధన నిల్వలు మాత్రమే ఉన్నాయి. అదనపు బఫర్​ లలో వాణిజ్యనిల్వలు, మంగళూరు, పాదూర్​, విశాఖపట్నం దగ్గర వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు మొత్తం కలిపి దాదాపు 100 మిలియన్​ బ్యారెళ్ల చమురు ఉంది. చమురు సరఫరా ఆగిపోతే ఈ నిల్వలు 40నుంచి 45 రోజుల దిగుమతులను కవర్​చేయొచ్చు.

మిడిల్​ ఈస్ట్​ లో ఏర్పడిన ఉద్రిక్తతల క్రమంలో చమురు సమస్యను ఎదుర్కొనేందుకు ముడి చమురు, పెట్రోల్​, డీజిల్​ , ఏటీఎఫ్​ వంటి కీలకమైన పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హార్దీప్​ సింగ్ పూరి  తెలిపారు.