భారత్కు అతిపెద్ద సహజ వాయువు సరఫరాదారు ఖతర్ గ్యాస్ సరఫరాను ఆపుతున్నట్టు ప్రకటించింది. ఇరాన్ డ్రోన్ దాడుల వల్ల గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భారత పరిశ్రమలకు సరఫరా అయ్యే గ్యాస్లో 40 శాతం వరకు కోత పడింది.
భారత్ ఏటా దిగుమతి చేసుకునే 2.7 కోట్ల టన్నుల లిక్విఫైడ్ నేచురల్గ్యాస్(ఎల్ఎన్జీ)లో ఖతర్ వాటా 40 శాతం ఉంది. విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, సీఎన్జీ పంపిణీ వంటి కీలక రంగాలకు ఇది ఎంతో అవసరం. ఎల్ఎన్జీ ఉత్పత్తిని నిలిపివేసిన విషయాన్ని గ్యాస్ దిగుమతి సంస్థ పెట్రో నెట్ ఎల్ఎన్జీ.. మనదేశ గ్యాస్ మార్కెటింగ్ సంస్థలకు తెలియజేసింది.
గ్యాస్ విక్రయ సంస్థలు సీఎన్జీ అమ్మకాలను కొనసాగిస్తూనే పరిశ్రమలకు ఇచ్చే సరఫరాలో 10 నుంచి 40 శాతం వరకు కోత విధించాయి. పెట్రోనెట్ సంస్థ ఖతార్ నుంచి ఏటా 85 లక్షల టన్నుల ఎల్ఎన్జీ కొనుగోలుకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. వీటితో పాటు స్పాట్ మార్కెట్ నుంచి కూడా అదనంగా గ్యాస్ కొనుగోలు చేస్తోంది.
గ్యాస్ కొరతను అధిగమించేందుకు గెయిల్, ఐఓసీ సంస్థలు ప్రస్తుతం స్పాట్ మార్కెట్ వైపు చూస్తున్నాయి. అక్కడా ధరలు భారీగా పెరిగాయి. ఎల్ఎన్జీ ధర ప్రస్తుతం ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్కు 25 డాలర్లకు చేరింది. ఇది సాధారణ ధరల కంటే దాదాపు రెట్టింపు.
