జీడిమెట్ల, వెలుగు: భార్య విడాకులు ఇవ్వడం లేదని ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్నగర్, వివేకానందనగర్కి చెందిన ప్రదీప్కుమార్(42) అకౌంటెంట్గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య ఉంది. రెండు సంవత్సరాలుగా ప్రదీప్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలో తరచూ భార్యతో విడాకులు ఇవ్వాలని గొడవ పడేవాడు. ఆదివారం భార్యతో విడాకుల కోసం గొడవపడ్డాడు. ఇందుకు భార్య నిరాకరించడంతో గదిలోకి వెళ్లి ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గమనించిన భార్య అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.