మద్యం మత్తులో ఓ యువకుడు రోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులతో అతను దురుసుగా ప్రవర్తించాడు. బ్రీత్ అనలైజ్ టెస్టులో 94bac పాయింట్లు రావడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆ యువకుడు రెచ్చిపోయాడు. పోలీసులతో వాగ్వావాదానికి దిగాడు. తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ ఎస్ఐను కాలితో తన్నాడు. దీంతో అతనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని ఆదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ యువకుడు ఆహా ఓటీటీలో పనిచేసే గౌరవ్ గా పోలీసులు గుర్తించారు.