హైకోర్టు జడ్జి తెలుసంటూ పోలీసులతో వాగ్వాదం

హైకోర్టు జడ్జి తెలుసంటూ పోలీసులతో వాగ్వాదం

మద్యం మత్తులో ఓ యువకుడు రోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న  ట్రాఫిక్ పోలీసులతో అతను దురుసుగా ప్రవర్తించాడు.  బ్రీత్ అనలైజ్ టెస్టులో 94bac పాయింట్లు రావడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆ యువకుడు రెచ్చిపోయాడు.  పోలీసులతో వాగ్వావాదానికి దిగాడు. తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ ఎస్ఐను  కాలితో తన్నాడు. దీంతో అతనిపై బంజారాహిల్స్ పోలీస్  స్టేషన్ లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు  చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని ఆదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ యువకుడు ఆహా ఓటీటీలో పనిచేసే  గౌరవ్ గా పోలీసులు గుర్తించారు.