వాటర్ హీటర్ షాక్ కు తల్లీ, ఇద్దరు కుమారులు మృతి

వాటర్ హీటర్ షాక్ కు తల్లీ, ఇద్దరు కుమారులు మృతి

కర్నూలు జిల్లాలో విషాదం జరిగింది. హాలహర్వి మండలం గుళ్లెం గ్రామంలో వాటర్ హీటర్ షాక్ తో తల్లీ ఇద్దరు కూమారులు మృతి చెందడం కలకలం రేపింది. ఇంట్లో వాటర్ హీటర్ కు చేయి తగలడంతో తల్లీ కవిత(35) కరెంట్ షాక్ గురైంది.  కొడుకు నిశ్చల్ కుమార్ (11), వెంకటసాయి(8) తల్లిని పట్టుకోవడంతో వారికి కూడా కరెంట్ షాక్ తగిలింది దీంతో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. ఒకేసారి ముగ్గురు చనిపోయిన ఘటన స్థానికులను కలిచివేసింది. మృతుల  కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

పాక్ పై నాలుగుసార్లు విజయం సాధించాం