ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో రిటైర్డ్ హైకోర్టు జడ్జికే టోకరా

ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో రిటైర్డ్ హైకోర్టు జడ్జికే టోకరా

ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో  రిటైర్డ్ హైకోర్టు జడ్జికే టోకరా పెట్టారు కేటుగాళ్లు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విరాళాల పేరుతో మోసం చేశారు. రాజకీయ పార్టీకి బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు అని మాయమాటలు చెప్పి ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ డీఎస్ఆర్ వర్మ కుటుంబం నుంచి రెండున్నర కోట్లు వసూలు చేశారు నరేంద్ర, కసిరెడ్డి శరత్ రెడ్డి అనే వ్యక్తులు. రెండేళ్లు గడిచినా బాండ్లకు సంబంధించిన రశీదులు ఇవ్వలేదు కేటుగాళ్ళు.

 బాండ్ల పేరుతో విరాళాలు చట్ట విరుద్దమంటూ ఇటీవల సుప్రీం కోర్టులో తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే..అప్రమత్తమయిన రిటైర్డ్ జడ్జి డీఎస్ఆర్ వర్మ రెండున్నర కోట్ల గురించి వాకబు చేశారు. సదరు పార్టీకి డబ్బులు చెల్లించకుండా సొంతానికి వాడుకున్నారని తెలియడంతో ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు జస్టిస్ వర్మ. పీసీ 406,420 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు  ఫిలింనగర్ పోలీసులు.