ఫాదర్స్ డే నాడే  తండ్రిపై దాడికి యత్నించిన కొడుకు

ఫాదర్స్ డే నాడే  తండ్రిపై దాడికి యత్నించిన కొడుకు

ఫాదర్స్ డే రోజునే తల్లిదండ్రులపై  దాడికి యత్నించాడు  ఓ కొడుకు.  కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామానికి చెందిన గుండేటి గణేష్ అనే యువకుడు మద్యానికి బానిసై కన్న తల్లిదండ్రులపైనే దాడికి యత్నించాడు.  సొంత ఇంట్లోనే దొంగతనాలకు పాల్పడుతూ తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నాడు. పీకలదాకా తాగడం, డబ్బులు అయిపోగానే తల్లిదండ్రులను కత్తులు , గొడ్డళ్లతో చంపుతానని బెదిరించి మరీ డబ్బులు తీసుకెళ్లడం అతనికి అలవాటుగా మారింది.

ఇతని వేధింపులు భరించలేక గతంలోనే భార్య పుట్టింటికి వెళ్లిపోగా తల్లిదండ్రులను నిత్యం వేధిస్తూ నరకం చూపిస్తున్నాడు. అయితే కొడుకు జీవితం బాగుపడాలని ఎప్పటికైనా మారుతాడేమోనని ఆశించిన తల్లిదండ్రులు ఇప్పటివరకు దాదాపు 10 లక్షల రూపాయలను కొడుకుకు సమర్పించుకున్నారు. చివరికి తల్లి మెడలోని పుస్తెలతాడు లాక్కెళ్ళడంతో ఈ వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించారు.  తండ్రి గుండేటి మల్లేశం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.