రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ‘యానిమల్’ చిత్రంలోని స్పెషల్ కట్ను దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా వద్ద ప్రదర్శించారు. ఈ ఈవెంట్కు రణ్బీర్ కపూర్, బాబీ డియోల్తో పాటు నిర్మాత భూషణ్ కుమార్ హాజరయ్యారు. వేదిక వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు. సహ నిర్మాతలు శివ చనన, ప్రణయ్ రెడ్డి వంగా కూడా ఈ గ్రాండ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఇటీవలే ఈ చిత్రం మాన్హాటన్ ఐకానిక్ టైమ్స్ స్క్వేర్లో సందడి చేసింది.
అక్కడి డిజిటల్ బిల్బోర్డ్లపై ప్రదర్శించిన టీజర్ అందర్నీ ఆకట్టుకోవడంతో ‘యానిమల్’ గ్లోబల్ దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలను విడుదల చేయగా, ‘అర్జన్ వైలీ’ అంటూ సాగే నాలుగో పాటను శనివారం రిలీజ్ చేశారు. సందీప్ రెడ్డి వంగా రూపొందించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. డిసెంబర్ 1న సినిమా విడుదలవుతోంది.