అయితే ఏంటీ : ఎమ్మెల్యేను అందరి ముందు.. రోడ్డుపైనే కొట్టిన మహిళ

అయితే ఏంటీ : ఎమ్మెల్యేను అందరి ముందు.. రోడ్డుపైనే కొట్టిన మహిళ

ఛండీగఢ్‌ : వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన ఓ ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించింది ఓ మహిళ. తమ ఊరంతా వరద నీటిలో మునిగిపోతే..తీరిగ్గా ఇప్పుడు ఎందుకు వచ్చావ్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి, చెంపపై కొట్టింది. దీంతో చేసేదేం లేక ఆ ఎమ్మెల్యే అక్కడి నుంచి మెల్లగా వెనుతిరిగాడు. ఈ ఘటన హర్యానాలోని ఘులా చోటుచేసుకుంది.

నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హర్యానాలోని ఘగ్గర్‌ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో భారీ వరదలతో ఘులా ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. ఇక్కడి ప్రజలు నాలుగు రోజులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి స్థానిక జననాయక్‌ జనతా పార్టీ (JJP) ఎమ్మెల్యే ఈశ్వర్‌ సింగ్‌ వెళ్లారు. 

ఇండ్లు నీట మునిగి దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలు.. తమను ఎవరూ పట్టించుకోలేదనే కోపంతో ఉన్నారు. ఎమ్మెల్యే తమ ప్రాంతానికి వెళ్లడంతో అతడిని చుట్టముట్టారు. వారిలో ఓ మహిళ కోపంతో ఎమ్మెల్యే చెంపపై ఒక్కటేసింది. ఇక్కడేముందని చూడటానికి వచ్చావంటూ నిలదీసింది. నదిపై కట్టి చెక్‌డ్యాం నిర్మించడం వల్లే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే సహాయకులు, అనుచరులు సదరు మహిళకు సర్దిచెప్పడంతో ఆమె శాంతించింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగాడు ఎమ్మెల్యే. 

Aslo Read :- ఫొటోలు : ఢిల్లీ మునిగింది, రోడ్లపైకి నీళ్లు, నీట మునిగిన ఇల్లు, వాహనాలు, అల్లకల్లోలంగా ఢిల్లీ

ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే ఈశ్వర్‌ సింగ్‌.. తాను ఆమె బాధను అర్థం చేసుకోగలనని చెప్పారు. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చెక్‌ డ్యాం వల్ల వరదలు రాలేదని.. భారీ వర్షాలే దానికి కారణమని ఆ మహిళతో చెప్పినట్లు వెల్లడించారు. జేజేపీ అధికార బీజేపీ (JJP) మిత్రపక్షం. ఎమ్మెల్యే చెంపను చెల్లుమనిపించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.