అంబులెన్స్ లోనే మహిళ ప్రసవం

అంబులెన్స్ లోనే మహిళ ప్రసవం

అంబులెన్స్ లో గర్భిణి ఆడ శిశవుకి జన్మనిచ్చిన ఉప్పల్ లో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..నాగోల్ లోని తట్టి అన్నారంకి చెందిన గర్భిణి రహ్మత్ కి ఇంట్లో ఉన్న సమయంలో నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె కుటుంబీకులు 108కి సమాచారం అందించా రు. వెంటనే 108 అంబులెన్స్ రహ్మత్ ఇంటి వద్దకి వచ్చింది. ఆమెను అంబులెన్స్ లో కోఠిలోని మెటర్నరీ హాస్పిటల్ కి తరలిస్తుండగా..మార్గమధ్యలో ఉప్పల్ వద్ద రహ్మత్ కి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్ లో సిబ్బంది ఈఎంటీ నరేశ్, పైలట్ భద్రు నాయక్ వెహికల్స్ ని ఉప్పల్ లో రోడ్డు పక్కనే నిలిపివేశారు. రహ్మత్ అంబులెన్స్ లో ఆడశిశువుకి జన్మనిచ్చిం ది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు కుటుంబుసభ్యలు తెలిపారు. తల్లీ, బిడ్డను మెరుగైన వైద్యసేవల కోసం కోఠిలోని మెటర్నరీ హాస్పిటల్ కి తరలించా రు.