కృష్ణా జిల్లా జి. కొండూరులో ఓ మహిళ దిక్కుతోచని స్థితిలో తోటలోనే ప్రసవించింది. కుంటముక్కలలో మామిడితోటలో కాపలా ఉంటున్న ఒరిస్సాకు చెందిన సునీత అనే మహిళ పురిటినొప్పులతో తోటలోనే శిశువుకి జన్మనిచ్చింది . సమయానికి వైద్య సేవలందక మహిళ ప్రసవించడంతో ఆమె కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. ప్రసవం జరిగిన అరగంటకు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లిబిడ్డా క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.
see more news