రంగారెడ్డి: గత నెల 29న కనిపించకుండా పోయిన నగరంలోని శివాజీనగర్ కు చెందిన ఓ యువకుడి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. జహీరాబాద్ అడవిలో ఆ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పు గూడ శివాజీ నగర్ ప్రాంతానికి చెందిన విశాల్ షిండే (22) గత నెల 29 వ తేదీన అదృశ్యమైనట్లు అతని తల్లి కల్పన, 30 వ తేదీన ఛత్రినాక పోలీసులు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అక్టోబర్ 1 (గురువారం) రోజున విశాల్ షిండే జహీరాబాద్ అడవిలో హత్యకు గురయ్యాడని సమాచారం అందింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు జహీరాబాద్ ప్రాంతానికి చేరుకొని విశాల్ షిండే మృతదేహానికి స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కేసులో నజీర్(20),జహీర్(19) మరి కొందరు కలసి విశాల్ ను జహీరాబాద్ అడవిలో హత్య చేసినట్లు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరి కొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.ఈ హత్య కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.