చెవిటి, మూగ మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన సంఘటన హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో బాధితురాలి ఇంట్లోకి చొరబడిన సాయి అనే యవకుడు బాత్రూమ్లో ఆమెను బంధించి అత్యాచారం చేశాడు.
ఆ తరువాత ఆమెను లోపలే ఉంచి గడియ పెట్టి అక్కడినుంచి పారిపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయిను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.