పెండ్లి పత్రికపై ప్రధాని మోదీ ఫొటో ప్రింట్..అభిమానం చాటుకున్న యువకుడు

పెండ్లి పత్రికపై ప్రధాని మోదీ ఫొటో ప్రింట్..అభిమానం చాటుకున్న యువకుడు

సంగారెడ్డి: పటాన్ చెరుకు చెందిన ఓ యువకుడు ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని వినూత్నరీతిలో చాటుకున్నాడు.. పటాన్ చెరు కుచెందిన నందికంటి సాయి కుమార్.. ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న అభిమానంతో తన పెళ్లి పత్రికలో మోదీ ఫొటోను ప్రింట్ చేయించాడు. అంతేకాదు ‘‘ నా పెళ్లికి వచ్చే వారు ఇచ్చే బహుమానం మోదీకి ఓటేయడమే అని రాయించాడు. 

ఈ విషయంపై సాయికుమార్ తండ్రి నర్సింహలు మట్లాడుతూ.. ప్రధాని మోదీ పది సంవత్సరాల్లో మంచి పాలన అందించారు..వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో  కూడా మోదీని గెలిపించాలని.. తన వంతుగా కుమారుడి వివాహ శుభలేఖపై మోదీ చిత్రాన్ని ప్రచురించి బంధువులు, మిత్రులకు, తెలిసిన వారందరికి పంచుతున్నానని తెలిపారు. మోదీకి  ఓటేసీ, మరోసారి ప్రధానిని చేయాలని ప్రచారం చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నామని చెప్పాడు.