ఇంట్లోనే భార్య వేరొకరితో ఎఫైర్.. అది చూసిన భర్త అతడిని..

ఇంట్లోనే భార్య వేరొకరితో ఎఫైర్.. అది చూసిన భర్త అతడిని..

నిజామాబాద్ క్రైం, వెలుగు : వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ యువకుడిని మహిళ భర్త ఇనుప రాడ్ తో కొట్టి మర్డర్ చేసిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. నిజామాబాద్ టౌన్‌‌‌‌ సీఐ బి.సత్యనారాయణ కథనం ప్రకారం… జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్ ప్రాంతానికి చెందిన ఉమాకాంత్ ప్రైవేట్ వాచ్ మన్ గా పనిచేస్తున్నాడు. అతడి భార్య నగరంలోని నాగారం 80 క్వార్టర్స్ ఏరియాలో ఉండే సాల్మన్ రాజు(25) అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు ఉమాకాంత్ అనుమానం పెంచుకున్నాడు. ఈక్రమంలో శనివారం రాత్రి ఆర్యనగర్ లోని తన ఇంట్లో భార్యతో సాల్మన్ రాజు ఉండడం ఉమాకాంత్ చూశాడు. దీంతో అక్కడున్న ఇనుప రాడ్ తో సాల్మన్ రాజు తలపై కొట్టాడు. అతడు తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉమాకాంత్ పై సంబంధిత ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ తెలిపారు.