న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. టైప్-2 డయాబెటిస్తో బాధపడుతున్న కేజ్రీవాల్కు అందుకే ఇన్సులిన్ ఇవ్వడంలేదని అన్నారు. తనకు ఇన్సులిన్ ఇవ్వాలని, తన ఫ్యామిలీ డాక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ కు అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరినా జైలు అధికారులు తిరస్కరిస్తున్నారని తెలిపారు.
దీంతో కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించి నెమ్మదిగా మరణించేలా కుట్ర చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాను ఈ విషయాన్ని పూర్తి బాధ్యతతో చెప్పాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. జైల్లో కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ రీడింగ్లను శనివారం ఆయన మీడియాకు వెల్లడించారు. కేజ్రీవాల్ తన రక్తంలో రోజువారీ షుగర్లెవల్స్ను చెక్చేసుకోవడానికి జైలులో యంత్రాన్ని ఉపయోగించడానికి కోర్టు అనుమతించిందని ఆయన పేర్కొన్నారు. జైలు అధికారులు, బీజేపీ, కేంద్రం, ఢిల్లీ ఎల్జీ తదితరులు కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.