మరో ఆప్ లీడర్కు ఈడీ సమన్లు

మరో ఆప్ లీడర్కు ఈడీ  సమన్లు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత దుర్గేష్ పాఠక్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడు విజయ్ నాయర్‌తో పాఠక్‌కు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై  విచారణ సంస్థ ఆయనకు సమన్లు ​పంపింది. పాఠక్‌ను ఈడీ సమన్లు పంపడం ఇది రెండోసారి. గతంలో సెప్టెంబర్ 6న ఈడీ పాఠక్‌ను విచారించింది. పాఠక్  ప్రస్తుతం ఎంసీడీ ఎన్నికలకు పార్టీ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు.  .  


పాఠక్‌కు ఈడీ సమన్లు జారీ చేయడం పై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్  సిసోడియా స్పందించారు “మా ఎంసీడీ ఇన్ఛార్జ్‌ కి, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి ఉన్న సంబంధం ఏమిటి? ఈడీ విచారణ ఎక్సైజ్ పాలసీపైనా లేకా ఎంసీడీ ఎన్నికలపైనా అంటూ ఆయన ప్రశ్నించారు.