
పద్మారావునగర్, వెలుగు: సాయం కోసం ఎదురుచూస్తున్న మహిళల కోసం గాంధీ హాస్పిటల్, భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో అభయ సపోర్ట్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
అనంతరం కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవోలు డాక్టర్ సుధార్ సింగ్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ యోగి, ప్రొఫెసర్ డాక్టర్ రాధా, ప్రొఫెసర్ డాక్టర్ అజయ్ మోహన్, సత్యవతి, అర్చనారావు, మంజుల, పద్మ, శాంతిప్రియ, లలిత, మాధవి, లక్ష్మీ, మీనా, సోనీ, కిన్నెర తదితరులు పాల్గొన్నారు.