- స్వయంగా ట్వీట్ చేసిన బాలీవుడ్ యాక్టర్
న్యూఢిల్లీ: బాలీవుడ్ యాక్టర్ అభిషేక్ బచ్చన్కు కరోనా నెగటివ్ వచ్చింది. జులై 11న కరోనా పాజిటివ్ అని తేలడంతో అభిషేక్ బచ్చన్ ముంబైలోని నానావతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దాదాపు నెల రోజుల పాటు ట్రీట్మెంట్ తర్వాత నెగటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన హెల్త్ బోర్డ్ ఫొటోను కూడా షేర్ చేశారు. “ నేను మీకు డిశ్చార్జ్ ప్లాన్ చెప్తాను: ఈ రోజు కరోనా నెగటివ్ అని తేలింది. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇంటికి వెళ్తునందుకు చాలా హ్యాపిగా ఉన్నాను. నానావతి డాక్టర్లు, స్టాఫ్కు కృతజ్ఞతలు. మా ఫ్యామిలీ కరోనాను జయించేందుకు డాక్టర్లు చాలా హెల్ప్ చేశారు. వాళ్లు లేకుంటే మేం అంతా కోలుకునే వాళ్లం కాదు” అని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వాళ్లంతా ముంబైలోని నానావతి హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకున్నారు. కాగా.. ఐశ్వర్య, ఆరాధ్య వ్యాధి నుంచి కోలుకుని త్వరగా డిశ్చార్జ్ అయ్యారు. అమితాబ్ బచ్చన్ పోయిన వారం డిశ్చార్జ్ అయ్యారు.