రియల్ బిజినెస్​ 111 జీవో ఎత్తివేత: పీపుల్స్ సైంటిఫిక్​ కమిటీకోసమే

రియల్ బిజినెస్​ 111 జీవో ఎత్తివేత: పీపుల్స్ సైంటిఫిక్​ కమిటీకోసమే
  • అభివృద్ధి అంటే అర్బనైజేషన్ ఒక్కటే కాదు - జంట రిజర్వాయర్లను ‘లివింగ్​ బీయింగ్’గా పరిగణించాలి
  • ‌‌గ్రీన్​జాబ్స్​క్రియేట్ చేయాలి
  • జంట జలాశయాల రక్షణకు విద్యార్థులు, మేధావులు ముందుకు రావాలి
  • పీపుల్స్ సైంటిఫిక్​ కమిటీ రిపోర్టు విడుదల కార్యక్రమంలో వక్తల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: హిమాయత్​సాగర్, ఉస్మాన్​సాగర్​(గండిపేట) జంట జలాశయాలను  ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ‘లివింగ్​బీయింగ్’​గా పరిగణించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. జీవో నం. 111 పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో గ్రీన్​జాబ్స్ క్రియేట్​చేయాలని పేర్కొన్నారు. సిటీలోఎంత సోషల్ఇన్వెస్ట్​మెంట్ చేస్తున్నారో..  ఆ ప్రాంతంలో కూడా అంతే ఇన్వెస్ట్​మెంట్​ చేయాలని కోరారు. 

ఇంటర్నేషనల్​రివర్స్​డే సందర్భంగా ఆదివారం హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో లాంగ్​ లైవ్​లేక్స్​క్యాంపెయిన్​ఆధ్వర్యంలో జీవో నంబర్ 111 రద్దుతో కలిగే దుష్ప్రభావాలపై పీపుల్స్​సైంటిఫిక్​ కమిటీ సైంటిస్టులు కె. బాబురావు, సాగర్​ధార, లింగేశ్వరరావు సంయుక్తంగా తయారు చేసిన 129 పేజీల రిపోర్టును విడుదల చేశారు. 

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ... జీవో నం. 111 రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, దాని రక్షణకు మరిన్ని జీవోలు తీసుకురావాలని, అదేవిధంగా జీవో నం. 69 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రియల్​ఎస్టేట్​బిజినెస్​కోసమే ప్రభుత్వం జీవో 111ను ఎత్తివేతకు నిర్ణయం  తీసుకుందని ఆరోపించారు. నేచురల్ ఫార్మింగ్​కు అక్కడి రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలన్నారు. 

2000 సంవత్సరంలో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పకుండా అమలు, జంట రిజర్వాయర్ల పరిరక్షణకు మానిటరింగ్​కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అభివృద్ధి  అంటే పట్టణీకరణ ఒక్కటే కాదన్నారు. 100 ఏళ్ల  చరిత్ర కలిగిన రిజర్వాయర్లకు కూడా హక్కులుంటాయన్నారు. ఎలాంటి సైంటిఫిక్​ రిపోర్టు లేకుండా, క్యాబినెట్​ నిర్ణయంతో జీవో 111ను రద్దు చేయడం ఏంటని సెంటర్ ఫర్​ వెల్ ​బీయింగ్​ ఎకనామిక్స్​ ఫౌండర్​, డైరెక్టర్ ​లుబ్నా సర్వత్ ప్రశ్నించారు. 

తాగునీటి కోసం సిటీ పక్కనున్న జంట రిజర్వాయర్లను వదిలేసి, కృష్ట్రా, గోదావరి జలాల కోసం కొట్లాడుతున్నారని మండిపడ్డారు. సర్వ రోగాలకు కాలుష్యమే కారణమని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైకోర్టు మాజీ చీఫ్​ జస్టిస్​చంద్రకుమార్​ పేర్కొన్నారు. 

జంట రిజర్వాయర్ల రక్షణ కోసం విద్యార్థులు, మేధావులు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రిటైర్ట్​ ఐపీఎస్​మేకల శ్రీనివాసులు, రైతు స్వరాజ్య వేదిక కన్నెగంటి రవి, మహ్మద్​ఫసీఖాన్, నేషనల్​ సైంటిస్ట్స్​ఆర్గనైజేషన్​ ప్రెసిడెంట్ కైసర్​జమీల్, బస్తీ వికాస్​మంచ్​జస్వీన్​జైరత్​, ప్రజా సంకల్పం కృష్ణ మోహన్, క్లైమేట్​ఫ్రంట్​ రుచిత్​ ఆశ కమల్​ తదితరులు పాల్గొన్నారు. ​