
- అభివృద్ధి అంటే అర్బనైజేషన్ ఒక్కటే కాదు - జంట రిజర్వాయర్లను ‘లివింగ్ బీయింగ్’గా పరిగణించాలి
- గ్రీన్జాబ్స్క్రియేట్ చేయాలి
- జంట జలాశయాల రక్షణకు విద్యార్థులు, మేధావులు ముందుకు రావాలి
- పీపుల్స్ సైంటిఫిక్ కమిటీ రిపోర్టు విడుదల కార్యక్రమంలో వక్తల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్(గండిపేట) జంట జలాశయాలను ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ‘లివింగ్బీయింగ్’గా పరిగణించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. జీవో నం. 111 పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో గ్రీన్జాబ్స్ క్రియేట్చేయాలని పేర్కొన్నారు. సిటీలోఎంత సోషల్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో.. ఆ ప్రాంతంలో కూడా అంతే ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరారు.
ఇంటర్నేషనల్రివర్స్డే సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో లాంగ్ లైవ్లేక్స్క్యాంపెయిన్ఆధ్వర్యంలో జీవో నంబర్ 111 రద్దుతో కలిగే దుష్ప్రభావాలపై పీపుల్స్సైంటిఫిక్ కమిటీ సైంటిస్టులు కె. బాబురావు, సాగర్ధార, లింగేశ్వరరావు సంయుక్తంగా తయారు చేసిన 129 పేజీల రిపోర్టును విడుదల చేశారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ... జీవో నం. 111 రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, దాని రక్షణకు మరిన్ని జీవోలు తీసుకురావాలని, అదేవిధంగా జీవో నం. 69 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రియల్ఎస్టేట్బిజినెస్కోసమే ప్రభుత్వం జీవో 111ను ఎత్తివేతకు నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. నేచురల్ ఫార్మింగ్కు అక్కడి రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలన్నారు.
2000 సంవత్సరంలో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పకుండా అమలు, జంట రిజర్వాయర్ల పరిరక్షణకు మానిటరింగ్కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అభివృద్ధి అంటే పట్టణీకరణ ఒక్కటే కాదన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన రిజర్వాయర్లకు కూడా హక్కులుంటాయన్నారు. ఎలాంటి సైంటిఫిక్ రిపోర్టు లేకుండా, క్యాబినెట్ నిర్ణయంతో జీవో 111ను రద్దు చేయడం ఏంటని సెంటర్ ఫర్ వెల్ బీయింగ్ ఎకనామిక్స్ ఫౌండర్, డైరెక్టర్ లుబ్నా సర్వత్ ప్రశ్నించారు.
తాగునీటి కోసం సిటీ పక్కనున్న జంట రిజర్వాయర్లను వదిలేసి, కృష్ట్రా, గోదావరి జలాల కోసం కొట్లాడుతున్నారని మండిపడ్డారు. సర్వ రోగాలకు కాలుష్యమే కారణమని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్చంద్రకుమార్ పేర్కొన్నారు.
జంట రిజర్వాయర్ల రక్షణ కోసం విద్యార్థులు, మేధావులు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రిటైర్ట్ ఐపీఎస్మేకల శ్రీనివాసులు, రైతు స్వరాజ్య వేదిక కన్నెగంటి రవి, మహ్మద్ఫసీఖాన్, నేషనల్ సైంటిస్ట్స్ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కైసర్జమీల్, బస్తీ వికాస్మంచ్జస్వీన్జైరత్, ప్రజా సంకల్పం కృష్ణ మోహన్, క్లైమేట్ఫ్రంట్ రుచిత్ ఆశ కమల్ తదితరులు పాల్గొన్నారు.