హైదరాబాద్​: అపార్ట్​ మెంట్​లో పేలిన ఏసీ కంప్రెషర్​..రూ.10 లక్షల ఆస్తి నష్టం

హైదరాబాద్​: అపార్ట్​ మెంట్​లో పేలిన ఏసీ కంప్రెషర్​..రూ.10 లక్షల ఆస్తి నష్టం

హైదరాబాద్ ​సిటీ, వెలుగు:  హైదరాబాద్ మధురానగర్​లోని దివ్యశక్తి అపార్ట్​మెంట్​లో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. రెండో ఫ్లోర్​లోని ఫ్లాట్ నంబర్​201లో కిశోర్​ అనే వ్యక్తి డబ్బింగ్ స్టూడియో నిర్వహిస్తున్నాడు. చార్మినార్​గుల్జార్​హౌస్ ​సమీపంలో జరిగిన మాదిరే ఇక్కడ కూడా ఏసీ కంప్రెషర్ నుంచి పొగలు వ్యాపించి మంటలు అంటుకున్నాయి. దీంతో స్టూడియోలో పనిచేస్తున్న సిబ్బందితోపాటు మిగిలిన ఫ్లాట్లలోని జనం పరుగులు తీశారు. సమాచారం అందుకున్న హైడ్రా, ఫిలింనగర్ ఫైర్ ​సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 

డబ్బింగ్ ​థియేటర్ ​ఓనర్ ​కిషోర్ బ‌య‌ట‌కు రాగా.. స్టూడియోలో చిక్కుకున్న రాజేశ్​ను డీఆర్ఎఫ్​ సిబ్బంది ల్యాడ‌ర్  సాయంతో బయటకు తెచ్చారు. సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పిందని ఫైర్ సర్వీస్​ ఇన్​స్పెక్టర్ ​రమేశ్ తెలిపారు. ఈ ఘటనలో డబ్బింగ్​ స్టూడియోలోని సౌండ్ ​సిస్టమ్ ​పరికరాలు దగ్ధమయ్యాయి.  రూ.10 లక్షల ఆస్తినష్టం సంభవించిందని బాధితులు తెలిపారు.