ఏసీబీకి చిక్కిన GHMC ఏఈ.. కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేలు లంచం..

ఏసీబీకి చిక్కిన GHMC ఏఈ.. కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేలు లంచం..

ఏసీబీ ఎన్ని దాడులు చేస్తున్నా.. ఎంత మందిని అరెస్టు చేస్తున్నా అధికారుల తీరు మారటం లేదు. ఏసీబీకి దొరికితే ఉద్యోగం రిస్క్ లో పడుతుందని కూడా ఆలోచించకుండా టేబుల్ కింద చేయి పెడుతూనే ఉన్నారు. సోమవారం (జూన్ 23) కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్న అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. 

ALSO READ | 80 ఏళ్ళ తల్లి, పక్షవాతంతో తమ్ముడు.. ఆస్తి కోసం ఇంటి నుంచి గెంటేసిన నీచుడు..

వివరాల్లోకి వెళ్తే.. అంబర్ పేట జీహెచ్ఎంసీలో  ఏఈ గా పనిచేస్తున్న మనీషా.. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ దొరికిపోయింది. బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేయడంతో ఇప్పటికే 5 వేల రూపాయలు ఇచ్చాడు ఆ కాంట్రాక్టర్. ఒప్పందం ప్రకారం మరో 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయటంతో ఏసీబీని ఆశ్రయించాడు. 

బాధితుని ఫిర్యాదుతో నిఘా ఉంచి జీహెచ్ఎంసీ కార్యాలయంపై రైడ్ చేశారు ఏసీబీ అధికారులు. సరిగ్గా లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా ఏఈ మనీషాను పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు.