లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జనగామ మున్సిపల్ కమిషనర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జనగామ మున్సిపల్ కమిషనర్

సూర్యాపేట రోడ్ లో బ్యాంకెట్ హాల్ పర్మిషన్ కోసం రూ. 40వేలు లంచం తీసుకుంటూ.. జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ దొరికారు. మున్సిపాలిటీ కార్యాలయంలోని తన చాంబర్లో లంచం తీసుకుంటుండగా.. కమిషనర్ రజితను అధికారులు పట్టుకున్నారు. 

బ్యాంకెట్ హాల్ పర్మిషన్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తుండగా.. మున్సిపల్ కమిషనర్ రజితను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ డిఎస్పి సాంబయ్య తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.