రేవంత్ రెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు

రేవంత్ రెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది.  ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఓటుకు నోటు కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని తెలుపుతూ రేవంత్ పిటిషన్ వేశారు. వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. అభియోగాల నమోదు కోసం విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఆ రోజున‌ నిందితులు హాజరు కావాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.