శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు

 శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు

HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. బెయిల్ మంజూరు చేయాలని శివ బాలకృష్ణ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు ముగిశాయి.  శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు చేయోద్దంటూ  కౌంటర్ పిటిషన్ వేశారు ఏసీబీ అధికారులు.. ఈ క్రమంలో దీనిపై నాంపల్లి ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. 

 ఏసీబీ విచారణలో శివ బాలకృష్ణ గురించి సంచలన విషయాలు బయటపడ్డాయి. శివబాలకృష్ణకు214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ప్లాట్స్‌‌, విల్లాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్‌‌ వ్యాల్యూ ప్రకారం రూ.250 కోట్ల కంటే రెట్టింపు ఉంటుందని అంచనా వేశారు. ప్రాంతాల వారీగా చూసుకుంటే వీటి విలువ దాదాపు రూ.650 కోట్లు దాటే అవకాశం ఉంది. 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణను గత నెల24న  ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు.