నగరానికి ఉపరాష్ట్రపతి.. వెహికల్ రిహార్సల్స్ లో ప్రమాదం

నగరానికి ఉపరాష్ట్రపతి.. వెహికల్ రిహార్సల్స్ లో ప్రమాదం

హైదరాబాద్ లో మరో డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర మద్యం మత్తులో ఇన్నోవా కారును నడుపుతూ మహ్మద్ అనే వ్యక్తి కానిస్టేబుల్ అశోక్ ను ఢీకొట్టాడు. దీంతో కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అతడ్ని హాస్పిటల్ కు తరలించారు. ఉపరాష్ట్రపతి హైదరాబాద్ రాక సందర్భంగా రిహార్సల్స్ చేస్తూ.. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అశోక్ ను మహ్మద్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఇన్నోవా కారుతో ఢీకొట్టాడు. మహ్మద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.