రాష్ట్రంలోని 20 జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్

రాష్ట్రంలోని 20 జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు  ప్రకటన విడుదల చేసిన వాతావరణ శాఖ... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.  ఇప్పటికే  మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమవుతోంది. వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక హైదరాబాద్ లో అయితే జన జీవనం స్తంభించింది. వరదల వల్ల కిలో మీటర్ల పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా... రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయన్న వాతావరణ శాఖ... రాష్ట్రలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 

రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలు (10)

  • అదిలాబాద్
  • కొమరం భీమ్ అసిఫాబాద్
  • నిర్మల్
  • జగిత్యాల
  • రాజన్న సిరిసిల్ల
  • కరీంనగర్
  • పెద్దపల్లి
  • మహబూబ్ బాద్
  • వరంగల్ అర్బన్
  • వరంగల్ రూరల్ 

అరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాలు (10)

  • మంచిర్యాల
  • నిజామాబాద్
  • భూపాలపల్లి
  • ములుగు
  • నల్గొండ
  • జనగామ
  • సిద్దిపేట
  • మంచిర్యాల
  • వికరాబాద్ కామారెడ్డి
  • మహబూబ్ నగర్