క్రేజీ ప్రాజెక్ట్‌‌లో హీరోగా నిఖిల్

క్రేజీ ప్రాజెక్ట్‌‌లో హీరోగా నిఖిల్

రీసెంట్‌‌గా ‘అర్జున్ సురవరం’గా వచ్చి మెప్పించిన నిఖిల్.. అప్పుడే తన కొత్త సినిమాని ప్రకటించేశాడు. సుకుమార్‌‌‌‌ అందించిన కథ, కథనాలతో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ ప్రతాప్ డైరెక్షన్‌‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్, బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా హీరోలతో పాటు బయటి హీరోలతోనూ సినిమాలు నిర్మించి మంచి విజయాల్ని అందించిన ఘనత గీతా ఆర్ట్స్​ 2 బ్యానర్​కి ఉంది. ఇక సుకుమార్ రైటింగ్స్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు సంస్థలూ కలిసి సినిమా ప్లాన్ చేశాయంటే సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయి. నిఖిల్​ కూడా చాలా సంతోషంగా, క్యూరియస్​గా ఉన్నాడు. ఇంతమంది పెద్దలు కలిసి తీస్తున్న ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, ఇది తన కెరీర్‌‌‌‌లోనే మర్చిపోలేని అనుభవమని అంటున్నాడు. అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఎదురైనా… నటుడిగా తనదైన ముద్ర అయితే వేశాడు నిఖిల్. కొన్ని మంచి విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో మరో లెవెల్‌‌కి వెళ్తానని అతడు ఆశిస్తున్నాడు. అదే నిజమవ్వాలని మనమూ కోరుకుందాం.