Surya46: మూవీ స్క్రిప్ట్తో.. పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య-వెంకీ.. షూటింగ్ ఎప్పుడంటే?

Surya46: మూవీ స్క్రిప్ట్తో.. పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య-వెంకీ.. షూటింగ్ ఎప్పుడంటే?

తమిళ హీరో సూర్య, తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ బ్యానర్పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఈ క్రమంలో నేడు (జూన్ 5న) హీరో సూర్య మరియు దర్శకుడు వెంకీ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. గురువారం తెల్లవారుజామున దేవాలయానికి చేరుకున్న సూర్య, వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జూన్ 9న షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు.

‘సూర్య 46 టీం.. దైవిక శక్తిని కోరుకోవడానికి పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించింది.  తమ మొదటి ప్రధాన అడుగు వేసే ముందు ఈ దైవ దర్శనం. జూన్ 9న షూటింగ్ ప్రారంభం. త్వరలో ఉత్తేజకరమైన అప్‌డేట్‌లు అందుబాటులోకి వస్తాయని’ మేకర్స్ వివరాలు వెల్లడించారు. 

మూవీ స్క్రిప్ట్‌తో పళనికి వెళ్లి దర్శనం చేసుకున్న వీరి ఫోటోలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. దాంతో సూర్య-వెంకీ ఫ్యాన్స్.. 'మీ కాంబో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం ఆల్‌ ది బెస్ట్‌' అని ఫ్యాన్స్ ట్వీట్స్ పెడుతున్నారు.

ఇటీవలే, మే19న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జ‌రిగిన‌ ఈ లాంచింగ్ కార్య‌క్ర‌మానికి చిత్రబృందంతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇది సూర్య కెరియర్లో 46వ సినిమాగా రానుంది. సూర్యకి జోడిగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. మూవీ 2026 సమ్మర్ లో  ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇకపోతే.. పళని మురుగన్ ఆలయం దిండిగల్ జిల్లాలో ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది తమిళ దేవుడు మురుగన్ యొక్క మూడవ నివాసం. తమిళనాడులోని దేవాలయాలలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే ఆలయం ఇది.