వెంకటేష్తో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. సంపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం ఆయన’ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. వెంకటేష్ 75 సినిమాల ప్రయాణాన్ని పురస్కరించుకుని ‘సెలబ్రేటింగ్ వెంకీ 75’ పేరుతో బుధవారం జరిగిన గ్రాండ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడారు. కలిసి సినిమా చేయాలనేది తమ ఇద్దరి కోరిక అని చెప్పారు. వెంకటేష్ మాట్లాడుతూ ‘గురువు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘కలియుగ పాండవులు’తో నా ప్రయాణం మొదలైంది.
జయాపజయాల్ని చూడకుండా నేను చేసిన విభిన్న చిత్రాల్ని ప్రోత్సహించారు. మొదట్లో ‘విక్టరీ’ అనేవారు. తర్వాత ‘రాజా’ అని పిలిచారు. కొన్నాళ్లు ‘పెళ్లికాని ప్రసాద్’ అన్నారు. తర్వాత ‘పెద్దోడు’, ‘వెంకీ మామ’ అన్నారు. ఇలా పిలుపు మారినా ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే ఎప్పటికప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నా’ అని అన్నారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు కె.రాఘవేంద్రరావు, బ్రహ్మానందం, నాని, అనిల్ రావిపూడి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.