
అమలాపాల్ చేసే పాత్రలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో.. ఆమె వ్యక్తిత్వం కూడా అంతే స్ట్రాంగ్. తూటాలు పేల్చినట్టు మాట్లాడుతుంది. మనసులో ఏదీ దాచుకోకుండా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది. అందుకే తన మాటలు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. రీసెంట్గా టాలీవుడ్ గురించి అమల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘నేను తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టేటప్పటికి అక్కడ పరిస్థితి వేరుగా ఉంది. ఇండస్ట్రీ కొన్ని ఫ్యామిలీస్ చేతిలో ఉందని నాకు అర్థమైంది. అక్కడ డామినేషన్ వారిదే. వాళ్ల సినిమాలు చాలా డిఫరెంట్గా ఉండేవి. కమర్షియల్ చిత్రాలు మాత్రమే తీసేవారు. ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండేవారు. వాళ్లు లవ్ సీన్స్కి, సాంగ్స్కి మాత్రమే పరిమితం.
అందుకే నేను తెలుగు ఇండస్ట్రీకి దగ్గరవలేకపోయాను. తక్కువ సినిమాలు చేశాను’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అమల. తమిళంలోనూ చాలా స్ట్రగులయ్యానని, మొదటి రెండు సినిమాలు ఇంతవరకు రిలీజ్ కాలేదని, ‘మైనా’ తర్వాతే కెరీర్ మలుపు తిరిగిందని చెప్పింది. ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్’లో చాన్స్ వస్తే నో అంది అమల. దాని గురించి అడిగితే.. తనకి మణిరత్నం అంటే చాలా ఇష్టమని, కానీ ఆయన ఆఫర్ ఇచ్చినప్పుడు తన మనసు బాలేదని, అందుకే నో అన్నానని చెప్పింది. అలా అని ఆ చాన్స్ వదిలేసుకున్నందుకు తానేమీ బాధపడటం లేదని కూడా అంది. ఆమె మాటల్ని కొందరు తప్పుగా తీసుకుంటుంటే.. అమల మాత్రమే ఏ విషయం గురించైనా ఇంత ఓపెన్గా మాట్లాడగలదు అని మిగతా వారంతా మెచ్చుకుంటున్నారు.