
బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలను, ఇటు టాలీవుడ్ ను కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారని వార్తలు రావడంతో తెలుగు సినీ పరిశ్రమలో ఇది హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ కేసులో టాలీవుడ్ సీనియర్ నటి హేమ పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్లు వార్తలు రావడంతో మరింత వైరల్ అయింది.
తాజాగా బెంగుళూరు రేవ్ పార్టీ పై వీడియో రిలీజ్ చేస్తూ..నేను నిరపరాధిని అంటూ నటి హేమ ప్రకటించింది.తనకు డ్రగ్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిందంటూ తాజాగా హేమ వెల్లడిస్తూ..తనపై మీడియా పుకార్లు ప్రచారం చేసిందని వ్యాఖ్యానించింది.హేమ మాటల్లోనే..
‘‘అందరికీ నమస్కారం నేను మీ హేమను. గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి. మీ అందరికీ తెలుసు. 30 సంవత్సరాలుగా సంపాదించుకున్న నా పరువును భూస్తాపితం చేశారు. అయితే నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. నా జుట్టుతో పాటుగా గోర్లు బ్లడ్ అన్నీ చేయించుకుంటే నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు చానల్స్లో నేను రావడం జరిగింది చెప్పడం కూడా.
అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఒక్కటే. నేను ఎలాంటి టెస్టుకైనా బహిరంగంగా రెడీగా ఉన్నానని మీ ముందు చెప్పడానికి వచ్చా. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అపాంట్మెంట్ కావాలని అడగడానికే ఈ వీడియో పెడుతున్నా’’ అని చెప్పుకొచ్చింది. అయితే, ఈ వ్యవహారంలో కొందరు నన్ను బ్లాక్ మెయిల్ చేశారు. ఏదేమైనా ఈ విషయంలో దేనికైనా రెడీ అంటూ హేమ తాజా వీడియోను విడుదల చేసింది.